హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ జరిగే 22న సెలవుదినంగా ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ప్రతి గ్రామంలో ఆ రోజున పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి సెలవు ఇవ్వాలని సంఘం అధ్యక్షుడు కే హనుమంతరావు, ప్రధాన కార్యదర్ళి నవత్ సురేశ్ కోరారు. గత ఏప్రిల్లో పదోతరగతి పరీక్షల మూల్యాంకన పారితోషికాన్ని ఉపాధ్యాయులకు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కృష్ణారావును కోరినట్టు తెలిపారు.