ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు
తాగునీరు.. 90 వేల ఎకరాలకు సాగునీరు
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): చెన్నూరు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆమోదం తెలిపింది. చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతలను నిర్మిస్తారు. దీనిద్వారా మొత్తం 90 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.1658 కోట్లు మంజూరు చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల గోదావరి నీటిని ఈ పథకానికి వినియోగిస్తారు. పార్వతి బరాజ్ నుంచి జైపూర్, మందమర్రి మండలాల్లోని 25,423 ఎకరాలకు, సరస్వతి బరాజ్ నుంచి చెన్నూరు, భీమారం, కోటపల్లి మండలాల్లో 48,208 ఎకరాలకు, లక్ష్మీ బరాజ్ నుంచి కోటపల్లి మండలంలో 16,370 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. చెన్నూరు ఎత్తిపోతలకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా స్థానిక బాల్క సుమన్, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.