శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్న ఆమెకు కర్నూల్ కలెక్టర్ కోటేశ్వర్రావు భ్రమరాంబ అతిథిగృహం వద్ద ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రధాన గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితుల పూర్ణకుంభంతో ఆలయ ప్రవేశం చేయించారు.
అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత ప్రకార మండపంలో అర్చక వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం గవర్నర్కు ఈవో లవన్న స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, శేషవస్త్రాలను అందించారు. తెలంగాణ గవర్నర్ వెంట కర్నూల్ జిల్లా ఎస్పీ సుధీర్కుమార్ రెడ్డి, ఆర్డీవో హరిప్రసాద్, ఆత్మకూర్ డీఎస్పీ శృతి ఉన్నారు.