హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాని చెప్పారు.
తెలుగు ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మన పెద్దలు మనకు అందిచిన భారతీయ సంస్కృతి మహోన్నతమైనదని చెప్పారు. సమస్త మానవాళి పట్ల సోదర భావాన్ని చూపించి, అందరూ మనవారేనన్న వసుధైక కుటుంబ భావనను భారతీయ సంస్కృతి ఆచరణలో చూపించిందన్నారు.