Governor Tamilisai | హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ ఖాతా ఈ నెల 14వ తేదీన హ్యాక్ అయిన విషయం తెలిసిందే. దీంతో రాజ్భవన్ అధికారుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూడు ఐపీ అడ్రస్ల నుంచి గవర్నర్ ట్విట్టర్ ఖాతా ఆపరేట్ అయినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మూడు ఐపీ అడ్రస్లు కూడా ఇండియా నుంచే ఉన్నట్లు గుర్తించారు.
హత్వే, యాక్ట్ సహా మరో ఇంటర్నెట్ సర్వీసు ద్వారా గవర్నర్ ఖాతాను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు అని తెలిపారు. ఈ మేరకు ఆ మూడు ఐపీ అడ్రస్ల వివరాలు పంపాలని ఆయా సర్వీస్ ప్రొవైడర్లను పోలీసులు కోరారు. ఆ వివరాలు అందగానే నిందితులను పట్టుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.