టీఎస్పీఎస్సీ నివేదిక విడుదల చేసిన గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్
హైదరాబాద్, మార్చి 15 : గత ఏడాది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా ప్రభుత్వం 2,370 ఉద్యోగాలు భర్తీచేసింది. పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లకు సంబంధించిన అభ్యంతరాలను పరిష్కరించి, ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ వివరాలను 2020-21 టీఎస్పీఎస్సీ వార్షిక నివేదికలో అధికారులు పొందుపరిచారు. మంగళవారం ఆ నివేదికను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజ్భవన్లో విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి కమిషన్ పనితీరు, రిక్రూట్మెంట్లపై గవర్నర్కు వివరించారు. ఈ ఏడాదిలో మూడు నోటిఫికేషన్ల ద్వారా 149 పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషన్ కార్యదర్శి అనితారామచంద్రన్, సభ్యులు రమావత్ ధన్సింగ్, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, కారం రవీందర్రెడ్డి, డాక్టర్ ఎరవెల్లి చంద్రశేఖర్రావు, ఆర్ సత్యనారాయణ పాల్గొన్నారు.