ధర్మారం, సెప్టెంబర్ 26: గవర్నర్ తమిళిసై రాజ్యంగ బాధ్యతలను మరిచి బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. క్యాబినెట్ ఆమోదించి పంపించిన ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దాసోజు శ్రవణ్, ఎస్టీ వర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణకు ఎమ్మెల్సీగా అర్హత లేదని గవర్నర్ అనడం బాధాకరమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ర్టాలను గవర్నర్ల ద్వారా ఇబ్బందిపెట్టాలని చూస్తున్నదని విమర్శించారు.