హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించాలంటే కర్బన ఉద్గారాలను సున్నా స్థాయి (నెట్ జీరో)కి చేర్చడమే మార్గమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) హైదరాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ‘ఈ-20 సమ్మిట్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్’ నిర్వహించారు.
‘పారిశ్రామిక రంగంలో నెట్ జీరో సాధన’ అనే అంశంపై నిర్వహించిన సదస్సును గవర్నర్ ప్రారంభించారు. సులభంగా చెప్పాలంటే భూ తాపాన్ని భూమికి వచ్చిన జ్వరంగా అభివర్ణించవచ్చని, నెట్ జీరో అనే చికిత్సతోనే నయం చేయవచ్చని గవర్నర్ వివరించారు.