హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ట్రైనీ ఐఏఎస్లు నిజాయితీ, నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా సూచించారు. సోమవారం లోక్భవన్లో 2025 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు ఎట్టబోయిన సాయిశివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరిప్రసాద్, పారస్ కుమార్, పీ సురేశ్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డి గవర్నర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ సుపరిపాలనకు కృషి చేయాలని సూచించారు. వారివెంట గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిశోర్, ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ చైర్ పర్సన్ శాంతికుమారి, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి ఉషారాణి ఉన్నారు.