ములుగు, ఆగస్టు28(నమస్తేతెలంగాణ): ములుగు(Mulugu) జిల్లాలో ఒక గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసు కుంటానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ(Jishnudev Verma)అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం గోవిందరావుపేట మండలం బుస్సాపురం గ్రామంలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరానికి చేరుకొని ఆయన బస చేశారు. బుధవారం ఉదయం బ్రేక్ఫాస్ట్ అనంతరం మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంతో కలిసి సరస్సులో గవర్నర్ స్పీడ్ బోటు షికారు చేస్తూ లక్నవరం అందాలను తలకించారు.
తాను ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గవర్నర్ వెల్లడించారు. అనంతరం సీతక్క మాట్లా డుతూ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని గవర్నర్ హామీ ఇవ్వడం చాలా అభినంద నీయ మని అన్నారు. గవర్నర్ పర్యటనకు సహకరించిన కలెక్టర్, పోలీసులు, ప్రజలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుగు ప్రయాణంలో గవర్నర్ ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాను సందర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అదేవిధంగా విషపురుగు కాటుకు గురైన కానిస్టేబుల్ను పరా మర్శించారు. గవర్నర్ వెంట టూరిజం ఎండీ ప్రకాశ్రెడ్డి, ఎస్పీ డాక్టర్ పి. శబరీష్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, డీఎఫ్వో రాహుల్ కిషన్, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, శ్రీజ, ఆర్డీవో సత్యపాల్రెడ్డితో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు.