ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధి కల్పన(Employment Generation)కు పెద్దపీట వేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(MLA, Jogu Ramanna) అన్నారు. బుధవారం పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్(BRS)లో చేరారు. ఈ సందర్భంగా వారికి జోగు రామన్న గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై యువకులు సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వాన్ని సమర్ధిస్తూ బీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పెద్ద సంఖ్యలో యువత ఉపాధి అవకాశాలను పొందుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందని వెల్లడించారు.ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ అందిస్తోందని గుర్తు చేశారు. ఐటీతోపాటు ప్రైవేట్ రంగంలో యువకులకు భారీగా ఉద్యోగాలు లభించాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.