హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం ప్రకటించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర వాటాపై చర్చకు కిషన్రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురించి మాట్లాడే అర్హత కిషన్రెడ్డికి లేదని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆరే కాకుండా 10 మంది సీఎంలు హాజరుకాలేదన్న విషయాన్ని కిషన్రెడ్డి గుర్తించాలని హితవు పలికారు. ఆదివారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో సునీత మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ముఖమే బీజేపీని గెలిపిస్తుందని కిషన్రెడ్డి అంటున్నారని, ఆ ముఖాన్ని చూసి తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. మోదీ పాలనలో సామాన్యులు, పేదలు బతకలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. పేదలు, సామాన్యులకు కంటినిండా నిద్ర, కడుపు నిండా బోజనం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. అధిక ధరలతో అల్లాడిపోతున్న ప్రజలు గురించి కిషన్రెడ్డి ఒక్క మాట మాట్లాడరని విమర్శించారు.
నీతి ఆయోగ్తో ఏంది ఉపయోగం?
నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులను మాట్లాడనివ్వరని, ఏవైనా సూచనలు చేసినా కేంద్రం అమలు చేయదని సునీత తెలిపారు. ఆ మాత్రం మీటింగ్కు కేసీఆర్ ఎందుకు పోవాలని ప్రశ్నించారు. ప్రజలే తమకు బాస్లు అని, వాళ్ల అవసరాలు తీర్చటమే బీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టంచేశారు. కిషన్రెడ్డి మాట్లాడే తీరు పద్ధతిగా లేదని ఆక్షేపించారు. రాష్ర్టానికి కేంద్రం నుంచి ఏం తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. ‘రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను నిర్వహించడంపైనా నరేంద్రమోదీతో చర్చించి నిర్ణయం తీసుకుంటారట. ఇలా ఉన్నది మీ పరిస్థితి’ అని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో ఆయన దోస్తులు అదానీ, అంబానీ, లతిత్ మోదీ మాత్రమే సంతోషంగా ఉన్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రైతులను చంపుతుంటే.. కేసీఆర్ ప్రభుత్వం రైతును రాజును చేస్తున్నదని పేర్కొన్నారు. బీజేపీది పైన పటారం, లోన లొటారం, నడిమింట్లో డంబాచారం అన్నట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
కొత్త పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలి: బాలరాజు
బీజేపీది మోదీవాదం తప్ప జాతీయ వాదం కాదని గువ్వల బాలరాజు విమర్శించారు. సచివాలయం ప్రారంభోత్సవంపై బీజేపీ నేతలు అవాకులు చవాకులు పేలారని, మరి పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఎన్ని పార్టీలు వచ్చా యో, ఎంత మంది ఎంపీలు వచ్చారో కిషన్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీకి వ్య తిరేకంగా సోషల్ మీడియా కదం తొకుతున్నదని, బీజేపీ తాను తీసిన గోతిలో తానే పడిందని అన్నారు. సీఎం కేసీఆర్తో కలిసి పనిచేసేందుకు ఎంతోమంది ముందుకొస్తున్నారని, మోదీని సాగనంపడం ఇక ఏమాత్రం ఆలస్యం కాదని పేర్కొన్నా రు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ శక్తిని చూసి బీజేపీ కాళ్ల కింద భూమి కదులుతున్నదని అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా పర్యటిస్తామని, దేశం మొత్తం కేసీఆర్ ఇజం రావాలని కోరుకొంటున్నదని తెలిపారు.