జోగులాంబ గద్వాల : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రతి ఇంటా సంక్షేమ పథకాలు అందుతున్నాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని కే.టి దొడ్డి మండలం కుచినేర్లకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలను అందజేస్తుందని వెల్లడించారు. ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తామని అన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో హరిజన చిన్న హనుమంతు,పెద్ద హనుమంతు, సురేశ్, కురువ దేవేందర్, భీమయ్య నర్సింహులు, సవారప్ప సవారప్ప , చిన్న నర్సింహులుతో పాటు మరో 30 మంది గులాబీ పార్టీలో చేరారు.