మెదక్ : బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న ప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ (BRS Member) కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలని నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే(Mla) మహారెడ్డి భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా(Medak District)లోని పెద్ద శంకరంపేట్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న ప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కార్యకర్త (BRS Member) ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు,మతాల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని వారిని నమ్మవద్దని కోరారు.
శ్రుతి మించుతున్న బీజేపీ(BJP) దుర్మార్గాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్న శక్తి సామర్ధ్యాలు ప్రత్యర్థులకు ఏ మాత్రం లేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ భూత్కూరి విజయరామరాజు, మండల పార్టీ అధ్యక్షులు ఆసురి మురళీ పంతులు, వైస్ ఎంపీపీ రమేశ్, మండల రైతు అధ్యక్షులు సురేష్ గౌడ్, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు దత్తు, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రాములు, పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.