హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ‘స్టాఫ్నర్స్’ అభ్యర్థుల అభ్యంతరాలపై ప్రభుత్వం స్పందించింది. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో వారి అభ్యంతరాలు నివృత్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా అధికారులను ఆదేశించారు. దీనికోసం ఈ నెల 15 వరకు అభ్యంతరాలు స్వీకరించాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ)ను ఆదేశించారు. అభ్యర్థుల సందేహాలను ఈ నెల 17లోగా నివృత్తి చేయాలని, ఒకవైళ ఎవరైనా అర్హులని తేలితే సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అవకాశం క ల్పించాలని చెప్పారు. మంత్రి ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే.. స్టాఫ్నర్స్ అభ్యర్థులు ఏమైనా సందేహాలు ఉంటే 15న సాయం త్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
రాష్ట్రంలో 9 విభాగాల్లో 7,094 స్టాఫ్నర్స్ ఖాళీల భర్తీకి నిరుడు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) పరీక్ష నిర్వహించింది. డిసెంబర్ 28న మెరిట్ జాబితాను విడుదల చేసింది. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో డిసెంబర్ 30న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలైంది. సుమారు 40 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. మెరిట్ జాబితాను వి డుదల చేశారు. సాధారణంగా మెరిట్లిస్ట్ పెడి తే.. వెబ్సైట్లోనే అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ కూడా అప్లోడ్ చేస్తారు. అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్ను స్వయంగా చూసుకుని అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుంది. మెరిట్ జాబితానే 1,419 పేజీలు ఇచ్చారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 200 పేజీలతో 9,892 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేశారు.
అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు అందుబాటులో లేవు. ఎన్ని మార్కులు వచ్చాయో స్వయంగా చూసుకునే అవకాశం లేదు. ఒక అభ్యర్థి తన జోన్లో, తన రిజర్వేషన్ క్యాటగిరీలో ఎన్ని మారుల వారిని పిలిచారో తెలుసుకోవాలంటే 1,419 పేజీల మెరిట్ జాబితాలోని 9,892 హాల్టికెట్ నంబర్లను వెతుకొని చెక్ చేసుకోవాల్సిందే. ఎన్ని మారులు వచ్చినవారిని వెరిఫికేషన్కు పిలిచారన్న వివరాలు లేక అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకన్నా తకువ మారులు వచ్చినవారిని ఎం పిక చేశారంటూ కొందరు ఇటీవల డీఎంఈ కార్యాలయం ఎదుట ఆం దోళన చేపట్టారు. జోన్లు, రిజర్వేషన్ క్యాటగిరీల వారీగా మెరి ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితాలను విడుదల చేసి తమ అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.