హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): కేంద్ర పన్నుల నుంచి రాష్ర్టాలకు రావాల్సిన వాటాను బుధవారం విడుదల చేశారు. రాష్ర్టాలకు నెలవారీగా వాటా కింద రూ.58,332 కోట్లు రావాల్సి ఉండగా.. ఒకేసారి రెండు వాయిదాలను కలిపి రూ.1,16,665.75 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. రాష్ర్టాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల కోసం ఈ నిధులను విడుదల చేసినట్టు వెల్లడించింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.20,928 కోట్లు, అత్యల్పంగా గోవాకు రూ.450 కోట్లు వచ్చాయి.
రాష్ర్టాలకు విడుదలైన నిధుల వివరాలు