రంగారెడ్డి : ప్రజల గురించి అనునిత్యం ఆలోచించే బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును గమనించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో బీసీల ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.
పిల్లల చదువుల కోసం గురుకులాలు, ఆడబిడ్డల పెండ్లిండ్ల కోసం కల్యాణలక్ష్మి, కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు తదితర సౌకర్యాలన్నింటిని సీఎం కేసీఆర్ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో భగవంతుడి పేరు మీద రాజకీయాలు నడిపించే వారిని నమ్మవద్దని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల కరెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇంటింటికి తాగునీరు అందిస్తుందని అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లు కనెక్టవిటి ని కల్పించారని తెలిపారు. విద్యాభివృద్ధికి పాఠశాలలు, కళాశాలలు పెద్ద ఎత్తున నిర్మించుకున్నామని అన్నారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం , బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రేఖాయాదగిరి నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.