ఆదిలాబాద్ టౌన్, మే 24: తెలంగాణ సర్కారు వైద్య విధానాలతో పీహెచ్సీలు, సర్కారు దవాఖానలు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాయి. పీహెచ్సీల పరిధి సబ్సెంటర్ల ఏఎన్ఎంలు, సిబ్బంది మారుమూల గిరిజన గ్రామాలకు అడవిదారిలో గుట్టల నడుమ నుంచి నడిచి వెళ్లి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని వాన్వట్ పంచాయతీ మంగ్లీ కొలాం గిరిజన పల్లెకు అంకోలి పీహెచ్సీ సిబ్బంది మర్సుకోల లక్ష్మీబాయి, విజయలక్ష్మి, నారాయణ, ప్రేంసింగ్ గుట్టల నడుమ నుంచి 5 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. అక్కడ గర్భిణులకు అవసరమైన చికిత్స అందజేసి పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. సిబ్చంది తమ గ్రామానికే వచ్చి వైద్యసేవలు అందించడంపై గిరిజనులు హర్షం వ్యక్తంచేశారు.