హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసుల కాల్పుల్లో మరణించిన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బిర్పేటకు చెందిన దామెర రాకేశ్ సోదరుడు రాజుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 17న నిరుద్యోగులు నిర్వహించిన నిరసన సందర్భంగా రైల్వే పోలీసులు కాల్పులు జరుపటంతో రాకేశ్ మృతిచెందిన విషయం తెలిసిందే.
రాకేశ్ మృతికి తీవ్ర సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, అతడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని నాడు హామీ ఇచ్చార. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. రాకేశ్ అన్నయ్య రాజుకు విద్యార్హతలకు తగిన ఉద్యోగం ఇవ్వాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.