హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తుందని ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కరాటే రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు శాసన మండలి ఆవరణలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల క్రీడలను నిర్వహిస్తూ, క్రీడాకారుల ప్రతిభను వెలికితీస్తుందన్నారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ లాంటి క్రీడలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
ముఖ్యంగా ఆడపిల్లలు కరాటే విద్యను తప్పకుండా అభ్యసించాలని సూచించారు.కార్యక్రమంలో ప్రభుత్వ విప్లు భాను ప్రసాద రావు, ఎంఎస్ ప్రభాకర్ రావు, నాంపల్లి టీఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.