హైదరాబాద్ : కౌకూర్ అటవీ ప్రాంతంలో చనిపోయిన రియల్టర్ నవీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు నగరంలోని జవహర్నగర్ పోలీసులు గురువారం తెలిపారు. జవహర్నగర్కు చెందిన నవీన్ రెడ్డి (32) రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాల బారిన పడ్డాడు. దీంతో అప్పులు తీర్చే విషయంలో మానసిక వేదనకు గురై విషం తాగి జీవితాన్ని ముగించాడని పోలీసులు వెల్లడించారు. మృతుడి భార్య పింకి తెలిపిన ప్రకారం.. అప్పులు తీర్చే క్రమంలో మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది.
శవ పరీక్ష చేసిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు సైతం విషం సేవించడం కారణంగానే వ్యక్తి మృతిచెందినట్లు తెలిపారు. బుధవారం అటవీ ప్రాంతంలోని చెట్ల పొదల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.