హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాను ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా బదిలీ చేసింది.
అక్కడ పనిచేస్తున్న అన్కిట్ను నిజామాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బదిలీ చేసింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుష్భూగుప్తాను ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా, సెలవుల్లో ఉన్న చహత్ బాజ్పాయిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.