హైదరాబాద్, జనవరి 22(నమస్తే తెలంగాణ): ధూపదీప నైవేద్యం (డీడీఎన్) పథకం కింద అర్చకులకు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల గౌరవ వేతనాలను మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి 6,271 మంది అర్చకులకు గౌరవ వేతనాల కింద రూ.11.02 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.