హైదరాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధూప దీప నైవేద్య పథకం కింద 2023-24 బడ్జెట్ నుంచి రూ.18,81,30,000 విడుదల చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6,271 ఆలయాలకు నెలకు రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో రూ.6 వేల చొప్పున ఇవ్వగా, ఈ ఏడాది నుంచి రూ.10 వేల చొప్పున ఇస్తున్నారు.
ఈ పథకం కింద ప్రస్తుతం ఏటా సుమారు రూ.75 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.230 కోట్ల వరకూ ఖర్చుచేయగా, ఆలయాల అభివృద్ధి కోసం దాదాపు రూ.3,000 కోట్లు వెచ్చించింది.