హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అధునాతన కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఒక్కరోజులోనే ఉత్తర్వులు ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న కోర్టు కాంప్లెక్స్లో ఒకే చోట 16 కోర్టుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని న్యాయవాదులు మంత్రికి చెప్పగా.. శ్రీనివాస్గౌడ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పాలమూరు యూనివర్సిటీ పకన నూతనంగా ఏర్పాటుకానున్న బైపాస్ రోడ్డు సమీపంలో అధునాతన కోర్టు కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించింది. హైకోర్టు స్థాయిలో పెద్ద కోర్టు భవనాన్ని నిర్మించేందుకు త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపడతామని మంత్రి తెలిపారు.