హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET ) దరఖాస్తుల (TET applications) గడువును ప్రభుత్వం పొడిగించింది(Date extended). ఈ నెల 20 వరకు గడువు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులకు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు 11 నుంచి 20 వరకు అవకాశం కల్పించింది.
టెట్ దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనున్నది. మంగళవారం నాటికి టెట్కు 1,93,135 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పేపర్-1కు 72,771, పేపర్-2కు 1,20,364 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గతంతో పోల్చితే దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.