హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను ప్ర భుత్వం వేగవంతం చేసింది. విద్యార్హతలు, ఖాళీల ఆధారంగా వివిధ శాఖల్లోకి 20, 555 మంది వీఆర్ఏలను సర్దుబాటు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. విద్యార్హతల మేరకు ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ను వర్తింపజేసింది. వీరిలో 61 ఏండ్లు దాటిన 3,797 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. వయసు నిర్ధారణకు ఈ ఏడాది జూలై 1ని కటాఫ్ తేదీగా నిర్ధారించింది. అప్పటికి 61 ఏండ్లలోపు వయసున్నవారికి నేరుగా పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు.
ఆ మార్గదర్శకాలు ఇవీ..