ఘట్కేసర్,ఆగస్టు7 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే ఆలయాలక మహర్దశ పట్టిందన్నారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎం.పావని, పోచారం వైస్ చైర్మన్ రెడ్యా నాయక్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.