హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్గా తేరా రజనీకాంత్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి పేరిట గురువారం జీవో జారీ అయ్యింది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.