MLA Raja Singh | హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ మరో 50 ఏళ్ల దాకా అధికారంలోకి రాదు అని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు.
బీజేపీ నేతలు మొండితనంతో ముందుకు పోతున్నారు. ఎవరి మాట వినడం లేదు. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇంకో 50 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడంలేదు. ఏ విధంగా గెలవాలి. ఓటరును ఏ విధంగా మన వైపు మళ్లించుకోవాలనే విషయాలను నేర్చుకోండి. ఏదైనా విషయం చెప్తే ఆలోచించండి. తెలంగాణలో బీజేపీ చనిపోతుంది, కిషన్ రెడ్డి గారు దయచేసి కాపాడండి అని ఎమ్మెల్యే రాజాసింగ్ వేడుకున్నారు.
తెలంగాణలో బీజేపీ మరో 50 ఏళ్ల దాకా అధికారంలోకి రాదు!
తెలంగాణ బీజేపీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్
బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇంకో 50 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడంలేదు
తెలంగాణలో బీజేపీ చనిపోతుంది, కిషన్ రెడ్డి గారు… pic.twitter.com/LfBnvhXJCu
— Telugu Scribe (@TeluguScribe) November 15, 2025