BRS Party | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో వేగంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన 9 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ తొమ్మిది మందికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఫామ్స్ అందజేశారు.
మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ వారికి బీఫామ్స్ అందించి అభినందించారు. అలంపూర్కు గతంలో ప్రకటించిన అబ్రహంకు కాకుండా విజేయుడికి బీ ఫామ్ అందించారు. గోషామహల్ అభ్యర్థిగా నంద కిషోర్ వ్యాస్, నాంపల్లి అభ్యర్థి అనంద్ కుమార్ గౌడ్ను ఖరారు చేశారు. వీరికి బీఫాం అందించడంతో మొత్తం 119 మందికి బీ ఫాం అందించడం పూర్తి అయింది. గతంలోనే 110 మందికి సీఎం కేసీఆర్ బీ ఫాంలు అందించారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో 9 మందికి కేటీఆర్ బీ ఫామ్స్ అందించారు.
1. చాంద్రాయణ గుట్ట -ఎం.సీతారాం రెడ్డి
2. యాకత్ పురా – సామా సుందర్ రెడ్డి
3. బహుదూర్ పుర – ఇనాయత్ అలీ బక్రీ
4. మలక్ పేట- తీగల అజిత్ రెడ్డి
5. కార్వాన్ – అయిందాల కృష్ణ
6. చార్మినార్ – సలావుద్దీన్ లోడి
7. నాంపల్లి – సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్
8. గోషామహాల్ – నంద కిషోర్ వ్యాస్
9. అలంపూర్ – విజేయుడు