చిక్కడపల్లి, ఫిబ్రవరి 20: సామాజిక సమస్యలపై సామాన్యులకు అర్థమయ్యేలా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచనలు, పాటలను రాశారని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ చాన్స్లర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం’పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన సందర్భంగా ఆదివారం బాగ్లింగంపల్లిలోని ఎన్జీవోస్ నెట్వర్క్ కార్యాలయంలో విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ సాహి త్య అకాడమీ అవార్డుతో వెంకన్నకు న్యాయం జరిగిందని అన్నారు. సాహిత్యాన్ని విస్తరింపచేయడంలో బిక్కి కృష్ణలాంటి వారు ఎంతోకృషి చేస్తున్నారని అన్నా రు. బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వహణ సంస్థ జెల్ది విద్యాధర్రావు పాల్గొన్నారు.