వాషింగ్టన్, ఏప్రిల్ 7: గూగుల్ సెర్చ్ ఇంజిన్కు త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను చేరుస్తున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఏఐ చేర్చిన తర్వాత వైవిధ్యమైన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంలో గూగుల్ సామర్థ్యం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
గూగుల్ను యూజర్లు ప్రశ్నలు అడగవచ్చని, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్(ఎల్ఎల్ఎం)ను వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఏఐని చేర్చిన తర్వాత ప్రతి సాఫ్ట్వేర్ క్యాటగిరిలోనూ మార్పులు తీసుకురానున్నట్టు చెప్పారు.