హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని తాడి-అనకాపల్లి మధ్య బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ ప్రధాన మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దుచేశారు. ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 8.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుందని అధికారులు వెల్లడించారు.