మెదక్ : మెతుకుసీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్నది. రైల్వేలైన్ రాకపోకలు ఆగస్ట్ 1న తీరనున్నది. అదే రోజు రైల్వే రెక్ పాయింట్ ప్రారంభం కానుంది. ప్రత్యేక గూడ్స్ రైలులో ఎరువులు రానున్నాయి. ఈ మేరకు గురువారం మెదక్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి , కలెక్టర్ హరీశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అక్కనపేట- మెదక్ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.50కోట్లు కేటాయించినన్నట్లు తెలిపారు. ఎప్పటి కప్పుడు నిధుల కేటాయింపు తో పాటు, పనులు త్వరగా పూర్తయేలా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు పర్యవేక్షించారని పేర్కొన్నారు. గజ్వేల్కు రేక్ పాయింట్ ఏర్పాటు అనంతరం మెదక్లో ఏర్పాటుకు సెంట్రల్ ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ అంగీకారం తెలిపిందనారు.
ఆగస్ట్ 1న మెదక్లో రేక్ పాయింట్ ప్రారంభించడానికి మంత్రులు హరీశ్రావు, నిరంజన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. గూడ్స్ రైలులో ఎరువులు రానున్నాయని, రెకే పాయింట్తో సకాలంలో జిల్లాలోని రైతులకు ఎరువులు అందుబాటులో ఉంటాయని అన్నారు . ఎఫ్సీఐకి పంపే బియ్యాన్ని రైల్వే మార్గం ద్వారా పంపవచ్చ ని ఎమ్మెల్యే తెలిపారు. రేక్ పాయింట్తో పలువురికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి కౌన్సిలర్లు సమియొద్దీన్, జయరాజ్ తదితరుల పాల్గొన్నారు.