మంచిర్యాల, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘పుట్టింది పొరుగున.. పురుడు తెలంగాణలో’ శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు స్పందించారు. మహారాష్ట్ర ఆడబిడ్డలు తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానలకు వచ్చి ప్రసవాలు చేయించుకుంటున్నారు. ఇలా వచ్చే వారు ఏటా వేల సంఖ్యలో ఉంటున్నారు. ఈ వివరాలతో గత ఐదేండ్లుగా జరిగిన ప్రసవాలపై కథనం ప్రచురితమైంది.ఈ కథనం క్లిప్పింగ్ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ట్వీట్ చేయగా.. మంత్రి హరీశ్రావు రీ ట్వీట్ చేశారు.