Telangana Budget | 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్థానిక సంస్థలకు శుభవార్త వినిపించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సంస్కరణ వల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఫైనాన్స్, ట్రెజరీల ఆమోదం కోసం వేచి చూడకుండా, స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు.