Telangana | తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సందర్భంగా కాంటాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కాంటాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్కు సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఫైల్పై సంతకం చేయడంతో 40 విభాగాల్లోని 5,544 మంది రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ధన్యవాదాలు తెలిపారు.
ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు. ఎంతోకాలంగా రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల ఎట్టకేలకు తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సాకారమైంది. సీఎం కేసీఆర్ నిర్ణయంపై కాంటాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం నిర్ణయంతో 2,909 జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ, 184 మంది జూనియర్ లెక్చరర్లు (వొకేషనల్), 390 మంది పాలిటెక్నికల్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్యారోగ్యశాఖలో 837 మంది వైద్య సహాకులు, వైద్యశాఖలో 179 ల్యాబ్ టెక్నీషియన్, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులతో పాటు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.