2 రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష
వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీరావు
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీరావు గురువారం తెలిపారు. బుధవారం నిర్వహించిన యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయన్నారు. యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్లో నెగెటివ్ వచ్చిందని, ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్లో కచ్చితమైన ఫలితం రాలేదని చెప్పారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒకోసారి ఖచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.