యాదాద్రి భువనగిరి : తెలంగాణలో రౌడీల పాలన నడుస్తున్నది. నిన్న నర్సాపూర్లో(Narasapur) ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి పైన దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ( Sunitha Mahender Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ప్రశ్నిస్తే వాళ్లను టార్గెట్ చేసి భౌతిక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ దాడులను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు.
మొన్న పాడి కౌశిక్ రెడ్డి పై దాడి, నిన్న సునీత లక్ష్మారెడ్డి పైన దాడి, ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నాయన్నారు. తెలంగాణ అంటేనే భయపడి రోజులు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయి. మహిళలంటే కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి అసలు గౌరవం లేదన్నారు. దాడులు చేస్తాం, భయపెడతామంటే చూస్తూ ఊరుకోమని, బాధ్యత గల ప్రతిపక్షంగా మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర ప్రయత్నాలు మానుకో ..నరసాపూర్లో దాడికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.