యాదాద్రి భువనగిరి, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : గొల్లకురుమల కోసం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని తెలంగాణ గోట్స్ అండ్ షీప్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం గొర్రె మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణం నుంచి కలెక్టరేట్ వరకు ఒగ్గు కళాకారుల డోలు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు.
కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ హన్మంతు జెండగేకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 వేల మంది రూ.43,750 చొప్పున డీడీలు కట్టారని, వారందరికీ వెంటనే డబ్బులు చెల్లించాలని, లేదా గొర్ల్రైనా పంపిణీ చేయాలని కోరారు.