హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్కు ఎన్నికల సం ఘం ఆమోదం తెలపడంపై తెలంగాణ రైతు రక్షణ సమితి హర్షం ప్రకటించింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్న ట్టు పేర్కొన్నది.
ఈ మేరకు బీఆర్ఎస్తో దేశ రైతులకు బంగారు భవిష్యత్తు కలుగుతుందని ఆ సంఘం అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు తెలిపారు. రాష్ట్ర రైతుల బాగు కోసం ఎన్నో వినూత్న పథకాలను చేపట్టిన సీఎం కేసీఆర్.. దేశ రైతులకు మరింత మేలు చేస్తారని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ కోసం దేశ వ్యాప్తంగా రైతులు, రైతు నేత లు ఎదురు చూస్తున్నారని అన్నారు.