హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూ.20 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి విరాళంగా అందించారు. విలువైన రాళ్లు పొదిగిన కిరీటాన్ని ఆయన సోమవారం ఆలయ అధికారులకు అప్పగించారు. సాయి భక్తుడైన వంశీకృష్ణ ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్లో ఉంటున్నారు.
బాబా ఆశీస్సులతోనే ఉన్నత స్థితికి చేరుకున్నాననే విశ్వాసంతో తాను ఈ కానుకను షిర్డీ సాయికి సమర్పించినట్టు చెప్పారు. 365 గ్రాముల బరువున్న ఈ కిరీటాన్ని ఆలయ అర్చకులు గురుపౌర్ణమి సందర్భంగా సోమవారం బాబా మూలవిరాట్టుకు అలంకరించారు. వంశీకృష్ణను ఆల య ట్రస్ట్ అధికారులు బాబా విగ్రహం, శాలువాతో సత్కరించారు.