హైదరాబాద్, జనవరి 30(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయని ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ మత్స్యరంగ నిపుణులు డాక్టర్ మోదుగు విజయ్గుప్తా చెప్పారు. ఇటీవలే పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఆయనను సోమవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ నాయకత్వంలో ‘తెలంగాణ ముదిరాజ్ మహాసభ’ ప్రతినిధులు ఘనంగా సతరించారు. ఈ సందర్భంగా విజయ్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం సహా ఇతర నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్ల మూలంగా నీటి వనరుల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు.
ఈ మేరకు చేపల ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచుకునేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయని వివరించారు. ప్రభుత్వ ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం బాగున్నదని ప్రశంసించారు. ఫలితంగా మత్స్యకారుల ఆదాయం పెరగడంతో పాటు స్వయం ఉపాధి మెరుగైందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ మత్స్యరంగ నిపుణులు పిట్టల రవీందర్, మహాసభ నాయకులు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, గొడుగు శ్రీనివాస్, బిల్లు సత్తయ్య, బొకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.