హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బుధవారం 2.1 కిలోల బంగారాన్ని పట్టుకొని, నలుగురిని అరెస్ట్ చేశారు. దాని విలువ రూ.1.27 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నగరానికి చెందిన నలుగురు ధమ్మం ఫ్లైట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.
బయటికి వెళ్తున్న వారు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అధికారులు తనిఖీ చేయగా, బంగారం దొరికింది. వారు బంగారం స్మగ్లింగ్ పాల్పడుతున్నట్టు తేలింది.