హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.1.07 కోట్ల విలువైన బంగారాన్ని విశాఖ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు విశాఖ రైల్వేస్టేషన్లో గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. కోల్కతా నుంచి షాలిమార్-సికింద్రాబాద్ ఏసీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఈ బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు.
నిందితులు 1860.5 గ్రాముల బంగారాన్ని కడ్డీలు, ముక్కలుగా మార్చి కోల్కతా నుంచి తరలిస్తున్నట్టు రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ శనివారం తెలిపారు. నిందితులిద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించి.. విచారణ కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు.