హైదరాబాద్ : శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న వ్యకు్తన కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ ఇండియా AI952 విమానంలో దుబాయి నుంచి హైదరాబాద్ ఓ వ్యక్తి నుంచి 394.18 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని సదరు వ్యక్తి పెట్టెల మధ్యలో పెట్టి తరలిస్తుండగా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.20.40లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు వివరించారు.