కామారెడ్డి : భిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర నగర్లో మంగళవారం రాత్రి వరుస చోరీలు జరిగాయి. తాళాలు వేసి ఉన్న ఐదు ఇండ్లలో దుండగలు చోరీకి పాల్పడ్డారు. తులం బంగారం, 40 తులాల వెండి, రూ. 20 వేల నగదును చోరీ చేశారు. తపాలా కార్యాలయం తాళాలను దొంగలు పగులగొట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.