దుగ్గొండి, మే 12: సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్తో కలిసి ఆయన వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవా లు చేశారు. దుగ్గొండి మండలంలో రూ.15 కోట్ల తో గిర్నిబావి-దుగ్గొండి డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, చలపర్తిలో రూ.8 కోట్ల వ్యయంతో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాములను ప్రారంభించారు. అకాల వర్షాలతో నియోజకవర్గ రైతులకు రూ.37 కోట్ల పంట నష్టం చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చలపర్తిలో నిర్వహించిన సమానష్టపోయిన వేశంలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో 36 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములను తెలంగాణ వచ్చాక 74 లక్షల టన్నుల సామర్థ్యానికి పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. రైతుబంధు, రైతుబీమాతో రైతు కుటుంబం భరోసాతో బతుకుతున్నదని పేర్కొన్నారు. అకాల వర్షంతో పంట నష్టపోతే వెంటనే పంటలను పరిశీలించి ఎకరాకు రూ.10 వేలు అందించి రైతులకు ధైర్యం ఇచ్చిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పరిపాలన సాగుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రతి పల్లెకూ తాగు, సాగునీరు అందుతున్నదని పేర్కొన్నారు. తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు.