భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నది. గురువారం ఉదయం 53.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 12 గంటలకు 53 అడుగులకు తగ్గింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో బుధవారం భద్రాచలం వద్ద 54.5 అడుగులకు చేరింది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. అయితే వరద కాస్త తగ్గినప్పటికీ ఇప్పటికీ ప్రమాద స్థాయిని మించే ప్రవహిస్తున్నది.
గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలంలో లోతట్టు ప్రాంతాలు మరోసారి జలదిగ్భం ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. పైనుంచి భారీ వరద వస్తుండటంతో నెల రోజుల వ్యవధిలో అధికారులు మూడుసార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయడం విశేషం.